ఖాళీ బిందెలతో మహిళల ధర్నా | Sakshi
Sakshi News home page

ఖాళీ బిందెలతో మహిళల ధర్నా

Published Sat, Jan 2 2016 1:49 PM

women's dharna due to water problem

దామరచర్ల:  నల్గొండ జిల్లా దామరచర్లలోని కాలనీలకు చెందిన మహిళలు మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. నీటి ఎద్దడిపై ఎన్నిసార్లు ఉన్నతాధితారులకు విన్నవించినా ప్రయోజనం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎంపీడీవో నీటి ఎద్దడికి నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.
 
 

 

Advertisement
Advertisement