ఇంగ్లిష్ మీడియం ప్రీప్రైమరీఏర్పాటుకు కసరత్తు
జిల్లాకు 10 నుంచి 20 ఏర్పాటు చేసే ఆలోచనలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఒంటిపూట బడులను అమలు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుత వేసవి ఎండలు, ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తోంది. వీలైతే ఈ నెల 16 నుంచి లేదా 21 నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒంటి పూట బడులను కొనసాగించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళన నోటీసులు కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి... అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోనూ ఒంటిపూట బడుల ప్రారంభంపై చర్చించారు. దీనిపై శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి, చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అలాగే తల్లిదండ్రుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రీప్రైమరీ విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలుపై కసరత్తు చేస్తోంది. కడియం శ్రీహరి కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
ప్రతి జిల్లాలో 10 నుంచి 20 వరకు స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు పద్ధతిన ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చించినట్లు తెలి సింది. దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు విద్యా వార్షిక కేలండర్ అమలు, మార్చి 21 నుంచే 2016-17 విద్యా సంవత్సరం ప్రారంభం, ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపైనా కడియం సమీక్షించారు. సూర్యాపేటలో పరీక్షా పత్రాలు బయటకు రావడంపైనా చర్చించారు. శుక్రవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఒంటిపూట బడులపై నేడు నిర్ణయం
Published Fri, Mar 11 2016 12:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రజకులకు అండగా ఉంటాం
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement