ఆదిలాబాద్ క్రైం : యువకుడి వేధింపులకు యువతి బలైంది. బెదిరింపులు తాళలేక పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంది. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్లోని టైలర్స్కాలనీలో చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. టైలర్స్కాలనీకి చెందిన ఇందూర్ భూమన్న కూతురు కృష్ణవేణి(19) స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ఇదే కాలనీకి చెందిన వెంకట్నారాయణ అనే యువకుడు నాలుగేళ్లుగా ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. సదరు యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళతో సంచరిస్తుండగా కృష్ణవేణి చూసింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన కృష్ణవేణి ఈ నెల 19న రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. కూతురు నోటి నుంచి నురుగు రావడాన్ని గమనించిన తండ్రి భూమన్న విషయం ఆరా తీసి స్థానిక రిమ్స్కు తరలించాడు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న కృష్ణవేణి పరిస్థితి విషమించి గురువారం చనిపోయింది.
తనను నాలుగేళ్లుగా వెంకట్నారాయణ వేధిస్తున్నాడని, తన చావుకు అతడే కారణమని నోట్బుక్లో రాసి పెట్టింది. దీంతో ఆ నోట్బుక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సదరు యువకుడి స్వస్థలం గుంటూరు కావడంతో ఇటీవల ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. నెల రోజుల క్రితమే కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్న ఇల్లు విక్రయించి సొంతూరుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
యువకుడి వేధింపులకు యువతి బలి
Published Fri, Jan 23 2015 4:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement