రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Published Sun, Oct 18 2015 8:00 PM

young man  killed in road accident

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తూజగూడ గేటు వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే... మహబూబ్‌నగర్ జిల్లా నందిపాడుకు చెందిన కాశీ(18) స్థానికంగా ఉన్న కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం ముర్తూజగూడ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement