ఆస్పత్రిలోనే యువకుల ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలోనే యువకుల ఆత్మహత్యాయత్నం

Published Fri, Oct 23 2015 8:00 PM

youth attempts to suicide in hospital

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో దాసరాల సతీష్ (22), బత్తెలపూడి సతీష్ (21) తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.

గ్రామంలో ఇరువర్గాల యువకుల మధ్య గత కొన్ని రోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం వీరిని కొందరు తీవ్రంగా కొట్టి గదిలో బంధించారు. దీనిపై యువకుల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వారిని విడిపించి మిర్యాలగూర ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఇద్దరు తమకు ప్రాణహాని ఉందని సూసైడ్ నోట్ రాసి ఆస్పత్రిలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement