బూర్గంపాడు:తెలంగాణ ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి పదిలంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సారపాక ప్రధానకూడలిలో వైఎస్ విగ్రహాన్ని గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలపై అన్ని సామాజిక వర్గాల వారు పూర్తి సంతృప్తితో ఉన్నారని, ఆయనపై వారికి ఇప్పటికీ అభిమానం ఉందని అన్నారు. ‘‘ప్రతి పల్లెలో దేవుడి గుడి ఉందో లేదోగానీ, మహా నేత వైఎస్ విగ్రహం మాత్రం ఉంది’’ అని అన్నారు. వైఎస్ను ప్రతి ఒక్కరూ ఒక దేవుడిగా భావిస్తున్నారని అన్నారు.
దళితులకు, గిరిజనులకు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు వైఎస్ హయాంలో జరిగిన మేలు ఆ తరువాత జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న కాలంలో వైఎస్సార్ సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వైఎస్ ఆశయ సాధనకు వైఎస్సార్ సీపీ కృత నిశ్చయంతో పని చేస్తున్నదని అన్నారు. పాండురంగాపురం రైల్వేస్టేషన్ నుంచి సారపాక వరకు రైల్వే లైన్ను విస్తరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు. సారపాక రైల్వే లైన్ను సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రత్యేక అభినందనలు తెలిపారు.
వైఎస్ హయాంలోనే ఏజెన్సీ అభివృద్ధి : ఎమ్మెల్యే పాయం
వైఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏజెన్సీ అభివృద్ధి వేగవంతమైందని పినపాక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గిరిజనుల పోడు భూములకు పట్టాలిచ్చి, హక్కులు కల్పిం చిన ఘనత వైఎస్దేనని అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన రెండుసార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి సాగు నీటి ప్రాజెక్టులు మంజూరు చేశారని అన్నారు. ముత్యాలమ్మపేటలోని వైఎస్ విగ్రహాన్ని కూడా ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పాయం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కైపు రోశిరెడ్డి, సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటి సభ్యుడు బిజ్జం శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ వీరంరెడ్డి శ్రీని వాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు కైపు సుబ్బరామిరెడ్డి, భూపెల్లి నర్సింహారావు, మారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకులు ఉడుముల లక్ష్మీరెడ్డి, గంగిరెడ్డి శ్రీని వాసరెడ్డి, ఊసా అనిల్కుమార్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జక్కం సర్వేశ్వరరావు, పాటి భిక్షప తి, అంగోతు సునీత, చింతా కోటేశ్వరి, తుమ్మల పున్న మ్మ, అజ్మీరా వసంత, మండల నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భజన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల గుండెల్లో వైఎస్ పదిలం
Published Fri, Jan 29 2016 12:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement