హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో శుక్రవారం పలు నియామకాలు చేపట్టారు. ఈ తాజా నియమాకాల్లో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 11 మంది కార్యదర్శులు ఉండగా,10 మంది ఉప కార్యదర్శలున్నారు. ఎడ్మ కిష్టారెడ్డి, మతిన్, గాదె నిరంజన్ రెడ్డిలను వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకుంది.
దీంతో పాటు కల్చరల్, పబ్లిసిటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయచందర్ కు బాధ్యతలను అప్పగించగా, తెలంగాణ జిల్లాలకు పర్యవేక్షకులు(అబ్జర్వర్స్), కో అబ్జర్వర్ ను పార్టీ నియమించింది. నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షులను వైఎస్సార్ సీపీ నియమించింది.