నిరంతర పనితో ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, ప్రవర్తనపై దుష్ర్పభావం
పోలీసులకు 8 గంటల షిఫ్ట్ విధానం తప్పనిసరి చేయాలి
కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
పోలీసుల పనితీరుపై ‘ఆస్కి’ అధ్యయన నివేదిక సిఫారసులు
సాక్షి, హైదరాబాద్: అందరికీ భద్రత కల్పించే పోలీసు తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నాడు. సెలవులు, షిఫ్టులు ఎరగని విధులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. పోలీసుల కాఠిన్యం, కరకుదనం, దుష్ర్పవర్తనలు వంటి వాటికి నిరంతర పని ఒత్తిడే ప్రధాన కారణమని ప్రఖ్యాత పరిపాలన శిక్షణ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) దేశ వ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. తీవ్ర పని ఒత్తిడితో పోలీసులు ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని సైతం కోల్పోతున్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. 23 రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోని వివిధ వర్గాలకు చెందిన దాదాపు 12,156 మంది పోలీసులను ఈ సర్వేలో భాగస్వామ్యం చేసింది. పోలీసులు ఒక్కొక్కసారి ఏకంగా 24 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని.. సెలవును సైతం దాసోహం చేసి డ్యూటీకి హాజరు కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని నివేదిక తేల్చింది. డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అత్యవసర పరిస్థితి ఎదురవతుండటంతో దాదాపు 80 శాతం మంది సిబ్బందిని తిరిగి పిలిపించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇలా ఎక్కువ గంటలపాటు పనిచేయడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని.. పని ఒత్తిడి చీకాకుల్లో సామాన్యులపై నోరు పారేసుకున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయని.. ఈ నేపథ్యంలో పోలీసులు రోజురోజుకూ సరిగా విధులు నిర్వర్తించలేకపోతున్నారని వెల్లడించింది.
షిఫ్ట్ పద్ధతి పెడితే మేలు
పోలీసులో మార్పు తీసుకొచ్చేందుకు షిఫ్ట్ పద్ధతి పెడితే ఎలా ఉంటుందన్న దానిపై ఆస్కి చర్చించింది. ఇప్పటికే కేరళలో అమల్లో ఉన్న ఎనిమిది గంటల డ్యూటీ వ్యవస్థ విజయవంతమైనట్లుగా వెల్లడైంది. మధ్యప్రదేశ్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న పోలీసు స్టేషన్లకు వెళ్లి చేసిన అధ్యయనంలో కూడా ఇదే విషయం తేటతెల్లమైందని తెలిపింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బందిని పెంచాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది.
తీవ్ర ఒత్తిడిలో పోలీస్
Published Fri, Jun 5 2015 2:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement