ప్రైవేటు ఆసుపత్రులకు ‘108’ బంద్ | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆసుపత్రులకు ‘108’ బంద్

Published Wed, Sep 23 2015 2:59 AM

ప్రైవేటు ఆసుపత్రులకు ‘108’ బంద్ - Sakshi

- అంబులెన్స్ సేవలు
- ప్రభుత్వ ఆసుపత్రులకే జీవీకే-ఈఎంఆర్‌ఐ తాజా నిర్ణయం

 
సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య సేవల కోసం ‘108’ అంబులెన్సుల్లో తీసుకెళ్లే రోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించవద్దని జీవీకే-ఈఎంఆర్‌ఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే తరలించాలని నిర్ణయించింది. తక్షణమే అమల్లోకి తెస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇప్పటివరకు తాము కోరుకున్న ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే అవకాశాలను రోగులు కోల్పోయారు. ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి.

Advertisement
Advertisement