నేపాల్ బస్సు ప్రమాదంలో 12మంది భారతీయులు మృతి | Sakshi
Sakshi News home page

నేపాల్ బస్సు ప్రమాదంలో 12మంది భారతీయులు మృతి

Published Wed, Apr 22 2015 10:08 AM

12 Indian pilgrims die in bus accident in Nepal

ఖాట్మాండ్: నేపాల్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది భారతీయులు దుర్మరణం చెందారు. కొండప్రాంతంలో యాత్రికులతో వెళుతున్న ఈ బస్సు అదుపుతప్పి 100మీట్లర లోతు గల కొండ ప్రాంతంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది భారతీయ తీర్థయాత్రికులు దుర్మరణం చెందగా, మరో 27మందికి తీవ్రగాయాలయ్యాయి. యాత్రికులతో వెళుతున్న బస్సులో మొత్తం 45మంది యాత్రికులు ఉన్నారు. యాత్రికులు ఖాట్మండ్లోని పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం తిరిగి గుజరాత్లోని గోరఖపూర్ ప్రాంతానికి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదంలో మరణించిన యాత్రికులు గుజరాత్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Advertisement
Advertisement