యూపీలో 18 రైళ్లు బంద్ | Sakshi
Sakshi News home page

యూపీలో 18 రైళ్లు బంద్

Published Fri, Nov 28 2014 10:03 AM

యూపీలో 18 రైళ్లు బంద్

లక్నో: ఉత్తరప్రదేశ్లో మంచు కారణంగా 18 రైళ్లను రద్దు చేయనున్నారు. లక్నో నుంచి ఉత్తరాదిన పలు నగరాలు, పట్టణలకు వెళ్లే ఎక్స్ప్రెస్ సర్వీసులను 45 రోజుల పాటు ఆపివేయనున్నారు. శుక్రవారం రైల్వే శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి 15 వరకు రైలు సర్వీసులను రద్దు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. రైళ్లను రద్దు చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడుతుందని, అయితే ప్రతికూల వాతావరణంలో నడపడం శ్రేయస్కరం కాదని చెప్పారు. మంచు కారణంగా ప్రస్తుతం 12 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement