చిన్న సంస్థలకు 5,000 కోట్ల రీఫైనాన్స్ సౌలభ్యం: ఆర్‌బీఐ | Sakshi
Sakshi News home page

చిన్న సంస్థలకు 5,000 కోట్ల రీఫైనాన్స్ సౌలభ్యం: ఆర్‌బీఐ

Published Tue, Nov 19 2013 12:47 AM

చిన్న సంస్థలకు 5,000 కోట్ల రీఫైనాన్స్ సౌలభ్యం: ఆర్‌బీఐ - Sakshi

 ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సోమవారం లఘు, చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రూ.5,000 కోట్ల రీఫైనాన్స్ సౌలభ్యాన్ని కల్పించింది. ఏడాది కాలానికి ఆయా పరిశ్రమలకు ఎటువంటి ద్రవ్యలభ్యతా(లిక్విడిటీ) సమస్య తలెత్తకుండా చూడాలన్నది ఈ ప్రణాళిక ఉద్దేశమని ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్(సిడ్బీ), కొన్ని బ్యాంకులు ఇతర కొన్ని నియమిత ఇంటర్మీడియరీస్ ద్వారా ఈ రీఫైనాన్స్ పథకం అందుబాటులో ఉంటుందని వివరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement