93కు చేరిన పాక్ భూకంప మృతులు | Sakshi
Sakshi News home page

93కు చేరిన పాక్ భూకంప మృతులు

Published Wed, Sep 25 2013 10:06 AM

93 dead in Pakistan earthquake

నైరుతి పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో నిన్న సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య మంగళవారం ఉదయానికి 93 కి చేరింది. మరో 200 మంది గాయపడ్డారు. వారు స్థానికంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ ఘటనలో మరణించనవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

 

ఆ భూకంపం ధాటికి పేక మేడల్లా కుప్పకులిన భవనాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ఘటనపై పాక్ ప్రభుత్వ వెంటనే స్పందించింది. వైద్య బృందాలు, భద్రత దళాలు సహాయక చర్యల్లో పాల్గొనాలని పాక్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. బెలూచిస్థాన్ ప్రావెన్స్లో నిన్న మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్పై 7.7గా నమోదు అయింది.

Advertisement
Advertisement