* నిష్ఫలమవుతున్న ఆరోగ్యలక్ష్మి పథకం
* అంగన్వాడీల్లో భోజనానికి లబ్ధిదారుల విముఖత
* 30 శాతానికి మించని గర్భిణులు, బాలింతల హాజరు
* మహిళా సంక్షేమ శాఖ కొత్త నిబంధనే కారణం
* పాత విధానంలోనే అందించాలని కోరుతున్న లబ్ధిదారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలకు సమృద్ధిగా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ పథకం కింద సర్కారు ప్రకటించిన ఆహార పదార్థాలేవీ లబ్ధిదారులకు సంపూర్ణంగా చేరడం లేదు. పథకం అమలుకు సంబంధించి పెట్టిన కొత్త నిబంధనే దీనికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి గత జనవరి 1 నుంచి ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహార దినుసుల(పాలు, కందిపప్పు, బియ్యం.. తదితరాలు)ను ప్రతి బాలింతకు, గర్భిణికీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించేవారు.
అయితే.. జూన్ 1 నుంచి బాలింతలు, గర్భిణులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారాన్ని(భోజనం) తీసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు కొత్త నిబంధన విధించారు. దీంతో నెలరోజులుగా పౌష్టికాహారం కోసం అంగన్వాడీలకు వచ్చే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం అంగన్వాడీలకు వచ్చి, అక్కడ వండిన ఆహారాన్ని తినేందుకు కనీసం 30 శాతం మంది కూడా రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యలక్ష్మి పథకం కింద 5,18,215 మంది లబ్ధిదారులు ఉండగా.. ఇందులో గర్భిణులు 2,60,241 మంది, బాలింతలు 2,57,974 మంది ఉన్నారు.
పౌష్టికాహారం ఎందుకంటే..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. పౌష్టికాహారం అందని కారణంగా ఏటా ప్రసవ సమస్యలతో ప్రతి వెయ్యి మందిలో 110 మంది గర్భిణులు మరణిస్తున్నారు. 43 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు, 33.50 శాతం మంది మహిళలు తక్కువ బరువు కలిగి ఉంటున్నారు. రాష్ట్రంలోనూ గర్భిణులు, బాలింతలు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ చూపని కారణంగా పోషకాహార లోపాలు, తద్వారా కలిగే దుష్ర్పరిణామాల బారిన పడుతున్నారు. వీరి ఆరోగ్య సంరక్షణ నిమిత్తం పోషణ స్థాయిలను మెరుగుపర్చేందుకు సమగ్ర శిశు సంరక్షణ సేవల(ఐసీడీఎస్) ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటును తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
విలువ పెంచినా నిష్ఫలమే..
ఈ పథకం కింద గర్భిణులు, బాలింతలకు అందించే పోషకాహార పరిమాణాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1నఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రోజుకు రూ.15 విలువైన పోషకాహారం మాత్రమే లబ్ధిదారులకు ఇస్తుండగా, తాజా ఉత్తర్వుల మేరకు ప్రతిరోజూ రూ.21 విలువైన ఆహారాన్ని అందించాలి. అయితే.. ఆహార పదార్థాలను ఇంటికి ఇచ్చే విధానానికి స్వస్తి పలికి, అంగన్వాడీల్లోనే ఒక పూట పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన పట్ల ఎక్కువ మంది గర్భిణులు, బాలింతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలవారీగా లబ్ధిదారులు
‘అనారోగ్య లక్ష్మి’!
Published Mon, Jul 20 2015 2:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement