చట్టవిరుద్ధంగా ఉన్నవారికి ఊరట
మోర్తాడ్: సౌదీ అరేబియాలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులకు మరోసారి వెసులుబాటు కలిగింది. అలాంటి కార్మికులు స్వేచ్ఛగా ఇంటికి వెళ్లిపోయే అవకాశాన్ని అక్క డి ప్రభుత్వం కల్పించింది. రెండేళ్ల విరామం తర్వాత సౌదీ ప్రభుత్వం క్షమాభిక్షను మరోసారి అమల్లోకి తీసుకువచ్చింది. తెలంగాణ ప్రాంతం నుంచి విజిట్ వీసాపై సౌదీ ఆరేబియా వెళ్లి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్న వారితో పాటు..
కంపెనీ వీసాలపై వెళ్లి కంపెనీల్లో పని నచ్చక బయటకు వచ్చి కల్లివిల్లిగా మారిన కార్మికులు కలుపుకొని సుమారు 30 వేల మందికిపైగా ఉంటారని స్వచ్ఛంద సం స్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, సౌదీలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ పనులు చేస్తున్న కార్మికుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం రెండేళ్ల కిందట నతాఖా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ఈ చట్టం ప్రకారం వర్క్ పర్మిట్ లేకుండా చట్టవిరుద్ధంగా సౌదీలో ఉంటున్న కార్మికులు రాయభార కార్యాలయంలోగానీ, సౌదీ పోలీసులకు గానీ లొంగిపోయి ఇళ్లకు వెళ్లిపోవాలి. గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు సైతం తీరకపోవడం.. వచ్చిన కొద్దీరోజులకే ఇంటికి వెళ్తే పరిస్థితులు పూర్తిగా విషమిస్తాయన్న భయంతో చాలా మంది మొండిధైర్యంతో అక్కడే ఉండి ఏదో ఒక పని చేస్తూ కాలం గడుపుతున్నారు. క్షణక్షణం భయం.. భయంగా బతుకున్న వీరు పోలీసుల కంటపడకుండా ఉండిపోయారు. ఇలాంటి వారి కోసం సౌదీ ప్రభుత్వం మరోసారి క్షమాభిక్షను అమలులోకి తీసుకొచ్చింది.
ఈనెల 3 నుంచి క్షమాభిక్షను అమలులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వచ్చేనెల (సెప్టెంబర్) 30 వరకు గడవు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఈసారి స్వచ్ఛందంగా ఇళ్లకు వెళ్లిపోకపోతే కఠిన శిక్షలను అమలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. పాస్పోర్టులు లేని వారు విదేశాంగ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లో తాత్కాలి పాస్పోర్టును జారీ చేయనుంది. అయితే, కార్మికులే విమాన చార్జీలను భరించాల్సి ఉంటుంది.
సౌదీలో మళ్లీ క్షమాభిక్ష అమలు
Published Sun, Aug 9 2015 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement