పన్నీర్ ఇంటికి పోటెత్తిన అభిమానులు
చెన్నై: అధినేత్రి వీకే శశికళపై బాహాటంగా తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వానికి మద్దతు పోటెత్తుతూనే ఉంది. తమిళనాడు నలుమూలల నుంచి అన్నాడీఎంకే శ్రేణులు, మద్దతుదారులు తరలివచ్చి.. చెన్నైలోని సెల్వం ఇంటిముందు గుమిగూడారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
చెన్నై గ్రీన్వేస్ రోడ్డులోని పన్నీర్ సెల్వం నివాసం బుధవారం ఆయన మద్దుతదారులతో కోలాహలంగా కనిపించింది. ఇక్కడే పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారుల నివాసాలు కూడా ఉన్నాయి. ఇంటిముందు పెద్ద ఎత్తున గుమిగూడిన శ్రేణులను సెల్వం ఇంటిబయటకు వచ్చి కలిశారు. తెల్లని చొక్కా, తెల్లని ధోతి ధరించిన ఆయన ఈ సందర్భంగా జేబులో అమ్మ జయలలిత ఫొటో పెట్టుకున్నారు. ఆయన మద్దతుదారులు 'సేవ్ అన్నాడీఎంకే. ఓపీఎస్ను సీఎం చేయండి' అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ఓపీఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. అదేసమయంలో అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ నివాసమైన పోయెస్ గార్డెన్లోని వేదనియలం వెలవెలబోతూ కనిపించింది. సీఎం అయ్యేందుకు శశికళ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. తన గూటినుంచి ఎమ్మెల్యేలు జారిపోకుండా వారిని హోటల్కు తరలించి క్యాంపు రాజకీయాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. శశికళ తన వ్యూహాలలో తలమునకలవ్వడంతో ఇక్కడ పెద్దగా సందడి కనిపించడం లేదు.
సెల్వం ఎఫెక్ట్: పోయెస్ గార్డెన్ వెలవెల!
Published Wed, Feb 8 2017 6:25 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement