ఏఐ విమానంలో సాంకేతిక లోపం | Sakshi
Sakshi News home page

ఏఐ విమానంలో సాంకేతిక లోపం

Published Fri, Aug 22 2014 11:10 AM

ఏఐ విమానంలో సాంకేతిక లోపం - Sakshi

జైపూర్: ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం రాజస్థాన్ లోని జైపూర్ లో అత్యవసరంగా కిందకు దిగింది. ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే విమానం కిందకు దిగిందని అనుమానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ  ఎయిర్ బస్ 321 విమానంలో 103 మంది ప్రయాణికులున్నారు.

విమానం ఈ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. దీంట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఢిల్లీ నుంచి రప్పించిన మరో విమానంలో ప్రయాణికులను ఉదయం 9 గంటలకు  అహ్మదాబాద్ తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement