స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పైలట్! | Sakshi
Sakshi News home page

స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పైలట్!

Published Thu, Aug 11 2016 11:09 AM

స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పైలట్! - Sakshi

ఆయనో సీనియర్ పైలట్. ఎయిరిండియాలో సుదీర్ఘ అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి అరెస్టయి.. అనంతరం బెయిల్ మీద విడుదల అయ్యారు. దాదాపు రూ. 16 లక్షల విలువ చేసే 600 గ్రాముల బంగారు కడ్డీలను ఆ పైలట్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు ముంబై విమానాశ్రయంలో గుర్తించారు. ఆయన ఏడు బంగారు కడ్డీలను తన చెకిన్, హ్యాండ్ బ్యాగేజిలో ఉంచుకున్నారు. వాటిని గమనించిన కస్టమ్స్ సిబ్బంది ఇదేంటని అడిగితే.. వాటిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అంగీకరించారు.

ఈ విషయాన్ని కస్టమ్స్ శాఖకు చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలిపింది. సాధారణంగా విమానంలో వెళ్లే ప్రయాణికులతో పాటు సిబ్బంది అందరినీ కూడా తప్పనిసరిగా చెక్ చేస్తారు. అందులో భాగంగానే ఈ పైలట్‌ను కూడా తనిఖీ చేశారని, అప్పుడే బంగారం బయట పడిందని ముంబై విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటనపై ఎయిరిండియా మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Advertisement
Advertisement