రెండు నెలలు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేబుల్ టీవీ డిజిటల్ ప్రసారాల నిమిత్తం ఏర్పాటు చేసుకోవాల్సిన సెట్టాప్ బాక్సుల గడువును హైకోర్టు పొడిగించింది. ఈ నెల 31తో ముగుస్తున్న గడువును రెండు నెలల పాటు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం ప్రకారం కేబుల్ టీవీ ప్రసారాల డిజిటలైజేషన్ మూడో దశ అమలులో భాగంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో డిసెంబర్ 31 నాటికి డిజిటల్ అడ్రసబుల్ సిస్టమ్ (డాక్)ను ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు గాను వినియోగదారులందరూ సెట్టాప్ బాక్సులు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ఎంఎస్ఓల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం.సుభాష్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
సెట్టాప్ బాక్సుల కొరత తీవ్రంగా ఉందని, అందువల్ల 31 నాటికి డాక్ను అమలు చేయడం సాధ్యం కాదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సి.రామచంద్రరాజు వాదనలు వినిపిస్తూ, సరిపడా సెట్టాప్ బాక్సులను వినియోగదారులకు అందుబాటులో ఉంచడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, కానీ.. విఫలమైందని తెలిపారు. ప్రస్తుతం 15 శాతం మంది మాత్రమే సెట్టాప్ బాక్సులను పెట్టుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానానికి తాము వ్యతిరేకం కాదని, అయితే బాక్సులు అందుబాటులో ఉంచకుండా, గడువు సమీపిస్తున్నా దానిని పొడిగించకుండా ఏకపక్షంగా వ్యవహరించడంపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు.
న్యాయమూర్తి స్పందిస్తూ... గతంలో ఇదే హైకోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఉత్తర్వులిచ్చిందని, మళ్లీ ఎలా జోక్యం చేసుకోమంటారు... అని ప్రశ్నించారు. అప్పుడు హైకోర్టు రెండో దశ విషయంలో ఉత్తర్వులిచ్చిందని, ఇది మూడో దశపై పిటిషన్ అని రామచంద్రరాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గానీ, ఆయన కార్యాలయ న్యాయవాదులు గానీ లేకపోవడంతో, గడువును రెండు నెలలు పొడిగిస్తున్నట్లు పేర్కొంటూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యవహారంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఓలు సైతం సెట్టాప్ బాక్సుల ఏర్పాటుపై హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ ఎస్ఎస్ఓలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
సెట్టాప్ బాక్సులకు గడువు పెంపు
Published Thu, Dec 31 2015 12:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement