సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడలోని జలవనరుల శాఖ ప్రాంగణంలో ఉన్న తన క్యాంపు కార్యాలయాన్ని మినీ సెక్రటేరియెట్గా మార్చాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంగా తీర్చిదిద్దడానికి కూడా నిర్ణయం జరిగింది. సీఎం క్యాంపు ఆఫీసు సమీపంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ క్యాంపు కార్యాలయాలను ఇటీవలే ప్రారంభించారు.
వీటికి సమీపంలోని ఒక అపార్టుమెంటుకు సాధారణ పాలన విభాగం(జీఏడీ) తరలిరానుంది. మరికొన్ని శాఖలను కూడా ఈ ప్రాంతానికి తరలించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం తన నివాసం తాడేపల్లిలోని కరకట్టపై ఉన్న భవనంలో ఏర్పాటు చేసుకున్నందున విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని మినీ సెక్రటేరియేట్గా మార్చాలని నిర్ణయించారు. దీనిపై ఈనెల 1న విజయవాడలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
భద్రతా, నిఘా పెంపుపై కసరత్తు
రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు, సమీక్షలు, సమావేశాలు విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తుండటంతో రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసింగ్ వ్యవస్థను కట్టుదిట్టం చేసేలా ఏపీ హోంశాఖ దృష్టిసారించింది. విజయవాడతో పాటు, అమరావతి, తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాల్లో సమర్థ పోలీస్ అధికారులను నియమించేలా కసరత్తు సాగుతోంది. సీఎం చంద్రబాబు కాన్వాయ్కు కూడా భద్రత పెంచనున్నారు.
గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లిలోని సీఎం నివాసం వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇతర ఉన్నతాధికారుల భద్రత విషయంలోను ఇంటెలిజెన్స్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టారు. భద్రతా, నిఘా విషయాల్లో సమర్థ పోలీస్ అధికారులను ఇక్కడకు బదిలీ చేసేలా కసరత్తు సాగుతోంది. అక్టోబర్ 22న రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలోపే సమర్థులైన పోలీస్లను ఇక్కడికి తరలించనున్నారు.
మినీ సెక్రటేరియెట్గా సీఎం క్యాంపు ఆఫీసు
Published Thu, Oct 1 2015 9:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement