కలాం చివరి ట్వీట్.. | Sakshi
Sakshi News home page

కలాం చివరి ట్వీట్..

Published Mon, Jul 27 2015 9:33 PM

apj abdul kalam last tweet

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిట్టచివరకు వరకు దేశం పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. కలాం మరణించే రోజు కూడా ట్వీట్ చేశారు. తుది శ్వాస విడవడానికి దాదాపు 8 గంటల ముందు కలాం తన బాధ్యతలను తెలియజేశారు. ఈ రోజు షిల్లాంగ్కు వెళ్తున్నానని, లివబుల్ ప్లానెట్ ఎర్త్ అంశంపై కోర్సు తీసుకోబోతున్నట్టు ట్వీట్ చేశారు. షిల్లాంగ్ కు వెళ్లిన కాసేపటికే కలాం తుది శ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన కలాం సోమవారం రాత్రి కన్నుమూశారు.

 

Advertisement
Advertisement