జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన తీవ్రవాదుల దాడిలో ఓ ఆర్మీ అధికారి సహా మొత్తం 12 మంది మరణించారు. ఒకే బృందంగా బయల్దేరిన ఉగ్రవాదులు ముందుగా పోలీసు స్టేషన్ మీద, తర్వాత ఆర్మీ క్యాంపు మీద కాల్పులు జరిపారు. దీంతో నలుగురు పోలీసులు, ఓ ఆర్మీ అధికారి సహా మొత్తం 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.
ఈనెల 29 వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య న్యూయార్క్లో సమావేశం జరగనున్న నేపథ్యంలో కూడా.. ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగబడటం గమనార్హం. జమ్ము లోని సాంబ సెక్టార్లో రెండు గంటల వ్యవధిలో రెండు చోట్ల ఒకే ఉగ్రవాదుల బృందం దాడులు చేసింది. ఆర్మీ యూనిఫాంలో ఆటోరిక్షాలో వచ్చిన తీవ్రవాదులు మొదట పాక్ సరిహద్దుకు కిలోమీటర్ దూరంలో ఉన్న హీరాలాల్ పోలీస్ స్టేషన్పై బాంబులు విసిరి, అనంతరం ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. ఆ తర్వాత ట్రక్ డ్రైవర్ను హతమార్చి ట్రక్కులో అక్కడినుంచి పారిపోయారు.
తర్వాత అదే తీవ్రవాదుల బృందం పఠాన్కోట్- జమ్ము జాతీయ రహదారిపై ఉన్న ఆర్మీ క్యాంప్ వద్దకు చేరుకుని అక్కడ కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఒక ఆర్మీ అధికారి, మరో ఏడుగురు జవాన్లు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరినట్లయింది. ఇరుపక్షాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఫలితంగా జాతీయరహదారిని మూసేశారు.
కాశ్మీర్లో ఉగ్రదాడి: ఆర్మీ అధికారి సహా 12 మంది మృతి
Published Thu, Sep 26 2013 11:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement