నదుల అనుసంధానమని గొప్పలా?
సీఎంను నిలదీసిన జ్యోతుల నెహ్రూ
హైదరాబాద్: నదుల అనుసంధానం తానే చేశానని గొప్పలు చెప్పుకోవడానికి సీఎం చంద్రబాబుకు సిగ్గులేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానమనేది చంద్రబాబు చిరకాల కోరికని సాగునీటిశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటపుడు తన తొమ్మిదేళ్ల పాలన(1995-2004)లో సీఎం కనీసం ఆలోచనలు కూడా చేయలేదెందుకని ప్రశ్నించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు చెప్పి రాష్ట్రప్రజల్ని మభ్య పెట్టేయత్నం చేస్తున్నారని విమర్శించారు.
చరిత్ర పుటల్లోకి వెళ్లిచూడండి..
చరిత్ర పుటల్లోకి వెళితే ఆర్థర్ కాటన్ నిర్మించిన గోదావరి బ్యారేజీ కాలువకు, కృష్ణా బ్యారేజీ కాలువ ఏలూరు వద్ద కలుస్తుందని, ఆ కాలువ చాలా రోజులపాటు నావికా అవసరాలకు ఉపయోగపడిందని నెహ్రూ తెలిపారు. 1978లో జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా-చిత్రావతి-కుందూలను కలుపుతూ పెన్నానది అనుసంధానానికిగాను పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్కు శంకుస్థాపన చేశారన్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ సోమశిల, కండలేరును కలుపుకుని తెలుగుగంగ అని పేరు పెట్టారన్నారు. దివంగత వైఎస్ హయాంలో చాలాభాగం పనులు పూర్తయి ఈరోజు సోమశిల డ్యాంలోకి నీరు వస్తోందని తెలిపారు. ఇదంతా నదుల అనుసంధానంతోనే సాధ్యమైందనే విషయం టీడీపీ నేతలకు తెలిసి కూడా ఇప్పుడే చేసినట్లు చెప్పుకోవడం, ఎమ్మెల్యేలు డ్యాన్సులు చేసి డప్పులు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
తాడిపూడిని పూర్తిచేసింది వైఎస్..
తాడిపూడి పథకానికి చంద్రబాబు శంకుస్థాపన చేసి నిధులు కేటాయించకుండా వదిలేస్తే భారీగా నిధులిచ్చి నిర్మాణం పూర్తిచేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని నెహ్రూ తెలిపారు. ఈ పని చంద్రబాబు చేశానని చెప్పుకోవడానికి సిగ్గులేదా? అని దుయ్యబట్టారు.
అలా చెప్పుకోవడానికి సిగ్గులేదా?
Published Thu, Sep 10 2015 1:08 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement