మావోయిస్టుల దాడిలో అసిస్టెంట్ కమాండర్ మృతి | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల దాడిలో అసిస్టెంట్ కమాండర్ మృతి

Published Sat, Aug 22 2015 9:13 PM

Assistant commandor killed in maoists attack

చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టులు జరిపిన దాడిలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ మృతి చెందారు. జిల్లాలోని దర్బా పోలీస్‌స్టేషన్ పరిధిలోగల జీరంఘాట్ పోలీస్ క్యాంపు ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బలగాలు కూంబింగ్‌కు వెళ్లాయి. బంజారిన్ మందిరం వద్ద తారసపడిన మావోయిస్టులకు, జవాన్లకు నడుమ ఎదురుకాల్పులు జరిగాయి.

అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ కృష్ణ కుమార్‌సింగ్ అక్కడికక్కడే మృతిచెందగా మరో జవానుకు గాయాలయ్యాయి. అనంతరం మావోయిస్టులు ఇటీవల జీరంఘాట్‌లో నూతనంగా నిర్మించిన విజయవాడ, జగ్దల్‌పూర్ జాతీయ రహదారిని భారీగా ధ్వంసం చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో కాంగ్రెస్ అగ్రనాయకుల కాన్వాయ్‌పై మావోయిస్టులు జరిపిన దాడిలో 28 మంది మృతి చెందారు.

Advertisement
Advertisement