మెల్బోర్న్:ఆస్ట్రేలియా వీసాల కోసం స్థానిక మహిళలతో దొంగ పెళ్ళిళ్లు ఏర్పాటు చేసిన కేసులో భారత సంతతి దంపతులను స్థానిక ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైకి చెందిన మైగ్రేషన్ ఏజెంట్ చేతన్ మోహన్లాల్ మష్రూ, పెళ్ళిళ్ల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన అతని భార్య, ఆస్ట్రేలియూలోనే జన్మించిన దివ్య క్రిష్ణె గౌడలకు బ్రిస్బేన్ మేజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది. గత ఏడాది ఏప్రిల్లో వెలుగు చూసిన ఈ కేసులో నేరం రుజువైతే నిందితులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, సుమారు కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
నైరుతి బ్రిస్బేన్లోని ఆక్స్లీ నివాసంలో మష్రూ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా.. 30 మందికి పైగా పురుషులు, మహిళలకు వీరు దొంగ పెళ్ళిళ్లు ఏర్పాటు చేసినట్టుగా ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. 2011 మార్చి-2012 మార్చి మధ్యలో ఏర్పాటు చేసిన పెళ్ళిళ్లకు గాను మష్రూ దంపతులు 10 వేల నుంచి 20 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసినట్లు కామన్వెల్త్ ప్రాసిక్యూటర్ ఎయిమీ ఎస్తోర్ప్ ఆరోపించారు. వారిపై ఆరోపణలకు సాక్ష్యంగా కొన్ని బ్యాంకు స్టేట్మెంట్లు, మ్యారేజీ సర్టిఫికెట్లు కోర్టు ముందుంచారు. ఈ మొత్తం వ్యవహారంలో గౌడ ఎక్కువ లబ్ది పొందినట్టు ఆమె చెప్పారు. న్యాయవిద్యార్థి అరుున మష్రూ తన మైగ్రేషన్ ఏజెంట్ లెసైన్స్ గడువు గత ఏడాదిలో ముగిసినప్పటికీ రెన్యువల్ చేసుకోలేదని సమాచారం.
వీసాల కోసం దొంగ పెళ్లిళ్లు:దంపతులు అరెస్టు
Published Thu, Feb 13 2014 9:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement