Sakshi News home page

రైతు ఆత్మహత్యలను నివారించండి

Published Sun, Sep 27 2015 1:17 AM

Avoid farmer suicides

సీఎంకు సారంపల్లి విజ్ఞప్తి
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు అఖిల భారత కిసాన్ సభ సహాయ కార్యదర్శి సారంపల్లి మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు ఓలేఖ రాశారు. ప్రభుత్వ వ్యవసాయ విధానాల్లో లోపాల వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వాటి నివారణకు పరిహారమే పరిష్కారం కాదన్నారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు రైతులకు రాయితీపై అందించాలని కోరారు.

రబీలో అక్టోబర్ 15 వరకు పంట రుణాలు ఇవ్వాలని, వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని కోరారు. గ్రామ సభల ద్వారా కౌలుదారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.

Advertisement
Advertisement