బెంగళూరు: కారులో అధునాత జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్ను ఉంచి భార్యను వెంటాడాడు. సరిగ్గా ఆమె తన ప్రియుడికి దగ్గరగా ఉన్న సమయంలో తుపాకితో కాల్పులు జరిపాడు. ప్రియుణ్ని బతికించుకోవడానికి విఫలయత్నం చేసిన ఆమె.. చివరికి ఓ హోటల్గదిలో ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో సంచలనం రేపిన ఈ సంఘటనపై ఇరుకుటుంబాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దక్షిణ బెంగళూరుకు చెందిన శ్రుతి గౌడ(32) రైల్వే గొల్లహళ్లిలో పంచాయితీ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆమెకు భర్త రాజేశ్ గౌడ(33), ఇద్దరు పిల్లలు, మామ గోపాలకృష్ణ(78) ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి కారులో బయలుదేరిన శ్రుతి.. హేసరఘట్ట ప్రాంతంలో అమిత్ కేశవమూర్తి అనే వ్యక్తిని కలుసుకుంది. వివాహితుడైన అమిత్.. న్యాయవాదిగా పనిచేస్తున్నారు. చిన్నపాటి రాజకీయ నాయకుడు కూడా. ఇటీవలే ఆయన జేడీ(యూ) నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బైకర్గానూ ఆయనకు పేరుంది. శృతి మీద అనుమానంతో ఆమె కారును(జీపీఎస్ ట్రాకింగ్ పరికరం ద్వారా) వెంటాడిన రాజేశ్ గౌడ.. తండ్రి గోపాల కృష్ణ సాయంతో అమిత్పై దాడిచేశాడు. కారులో శ్రుతి, అమిత్లు పక్కపక్కన కూర్చుని ఉండగానే కాల్పులు జరిపి వెళ్లిపోయారు.
రక్తపుమడుగులో పడిపోయిన అమిత్ను శ్రుతి అతికష్టంమీద సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు తీవ్రత దృష్యా ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపే శ్రుతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో శ్రుతి తన పుట్టింటివారికి ఫోన్చేసి లాడ్జిలో ఉన్నట్లు చెప్పింది. అయితే వారు వెళ్లేసరికి ఆమె దుప్పటితో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి రెండు వేరు వేరు(అమిత్ కేశవమూర్తి హత్య, శ్రుతి ఆత్మహత్య) కేసులు నమోదుచేశామని పోలీసులు మీడియాకు తెలిపారు. అమిత్ను కాల్చిచంపింది రాజేశ్ గౌడా లేక తండ్రి గోపాల కృష్ణా అనేది తెలియాల్సిఉందని, అమిత్తో శ్రుతి బంధం, ఆత్మహత్యకు దారితీసిన ఇతర అంశాలను పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై ఇరు కుటుంబాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లోనూ రెండు కుటుంబాలు ఆనందంగా గడిపాయని, ఇంతలోనే చంపుకునేంత గొడవలు ఏమొచ్చాయో అర్థంకావడంలేదని అమిత్ తల్లి వెంకమ్మ వాపోయారు.
మృతులు అమిత్, శ్రుతి(పైన), నిందితులు గోపాలకృష్ణ, రాజేశ్ గౌడ(కింద) (ఫైల్ ఫొటోలు)
జీపీఎస్ ట్రాకింగ్తో భార్యను వెంటాడి..
Published Sat, Jan 14 2017 2:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement