ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారీ విజయంతో బీజేపీ శ్రేణులు సంతోషంగా ఉన్నా.. అధిష్టానం మాత్రం 2019 గురించే ఆలోచిస్తోంది. విపక్షాలన్నీ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బలమైన కూటమిగా ఏర్పడొచ్చనే సంకేతాలతో పార్టీ నాయకత్వం ఆలోచనలో పడింది. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఆవిర్భావం కారణంగా ఆ రాష్ట్రంలో బలమైన పట్టుందనుకున్న బీజేపీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో అలాంటి మహాకూటమి నిర్మాణం జరిగితే.. దీన్ని ఎదుర్కునేలా వ్యూహాలు రూపొందించాలని ఆరెస్సెస్ను కోరినట్లు తెలిసింది.
కొయంబత్తూరులో జరిగిన ఆరెస్సెస్ ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’లో ఈ అంశంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. యూపీ ఎన్నికల్లో ఎన్డీయే 42 శాతం ఓట్లు సంపాదించుకోగా.. విపక్షాలన్నీ కలిసి 55 శాతం ఓట్లు పొందాయి. దీంతో విపక్షాలన్నీ ఏకమైతే పరిస్థితులు ఎలా ఉండొచ్చనే అనుమానాన్ని ఈ సమావేశంలో బీజేపీ చర్చించింది. దీనికి సంబంధించిన వివరాలను సంఘ్ పెద్దలకు అందజేసింది. అందు కే దళితులు, గిరిజనులను పార్టీకి దగ్గర చేసేలా ప్రణాళికలు రూపొందించాలని, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని బీజేపీ కోరింది. బీజేపీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి రాంలాల్, సహ ప్రధాన కార్యదర్శులు శివప్రకాశ్ సింగ్, సౌదాన్ సింగ్, వి.సతీశ్ పాల్గొన్నారు.
‘దృష్టి’లో తెలుగు రాష్ట్రాలు
బీజేపీ ఆలోచన ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే ఈ ప్రాంతాల్లో పార్టీ క్షేత్రస్థాయి వరకు వెళ్లేలా ఆరెస్సెస్ వ్యూహాలు రచించాలని బీజేపీ కోరింది. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు విపక్షాలన్నీ సిద్ధమవుతున్నాయన్న సమాచారాన్ని బీజేపీ.. సంఘ్ పెద్దలముందుంచింది. దీనికి ప్రతివ్యూహాలను రచించాలని కోరింది. ఇప్పటికే ‘ఒకే గుడి, ఒకే శ్మశానం, ఒకే బావి’ పేరుతో కుల వివక్షలను పొగొట్టేలా గ్రామాల్లో ఆరెస్సెస్ ప్రచారం చేస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
‘కూటమి’ని ఎదుర్కొనేదెలా?
Published Thu, Mar 23 2017 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement