♦ వారణాసి పంచాయతీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకే పరిమితం
♦ యూపీలో చాలా చోట్ల బలం పుంజుకున్న బీఎస్పీ
లక్నో: ఉత్తరప్రదేశ్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియోజక వర్గం వారణాసిలో బీజేపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకోవలసి వచ్చింది. వారణాసిలోని 48 స్థానాల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థులు ఎనిమిది మంది మాత్రమే గెలుపొందారు. యూపీలో నాలుగు దశల్లో జరిగిన స్థానిక ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరిగింది. మోదీతోపాటు, ఎస్పీ, కాంగ్రెస్లను కూడా ఈ ఎన్నికలు గట్టి ఎదురు దెబ్బ తీశాయి. ఆశ్చర్యకరంగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ చాలా చోట్ల పుంజుకుంది. వారణాసి జిల్లాలో అధికార సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) తాను బలపరచిన 25 మంది అభ్యర్థులను గెలిపించుకోగలిగింది.
వారణాసి జిల్లాలో ప్రధాని దత్తత తీసుకున్న జయపూర్ గ్రామంలో బీజేపీ బలపరచిన అరుణ్సింగ్, బీఎస్పీకి చెందిన రమేశ్ తివారీ చేతిలో ఓడిపోయారు. ఈ జిల్లాలో ఎస్పీ 25, బీజేపీ 8, కాంగ్రెస్ 2. బీఎస్పీ 3, అప్నాదళ్ 4, స్వతంత్రులు 6 స్థానాల్లో గెలిచారు. గత పంచాయతి ఎన్నికల్లో ఈ జిల్లాలో బీజేపీ గెలుచుకుంది మూడు స్థానాలే . జిల్లా పంచాయతి అధ్యక్షుడిగా ఎస్పీ బలపరచిన అభ్యర్థే ఉంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సతీష్ ఫౌజీ తెలిపారు. అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఎస్పీ అభ్యర్థులకు ఎదురుదెబ్బే తగిలింది. పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతల కుటుంబసభ్యులు, బంధువులు పరాజయం పాలయ్యారు.
రాష్ట్రంలో 3112 జిల్లా పంచాయతి పదవులకు, 77,576 బ్లాక్ పంచాయతి పదవులకు ఎన్నికలు జరిగాయి. ఎస్పీ చీఫ్ ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజమ్గఢ్ స్థానంలో పార్టీ మద్దచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ, ఉపాధ్యక్షుడు రాహుల్ నియోజకవర్గం అమేథీలో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు ఘోరంగా ఓడారు. రాయబరేలీలో 22మంది పార్టీ అభ్యర్థులకు గానూ 21మంది ఓడిపోయారు. అటు అమేథీలో మొత్తం 8స్థానాల్లో కాంగ్రెస్ బలపరచిన ఏ ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. ఈ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరిగినవి కాకపోవడంతో పార్టీ బలాబలాలపై స్పష్టత రాలేదు.
ఎంఐఎం బోణీ.. యూపీ పంచాయతీ ఎన్నికల్లో ఎంఐఎం బోణీ కొట్టింది. ముజఫర్ నగర్ జిల్లాలో షెడ్యుల్ కులానికి చెందిన నిత్రాపల్ సింగ్ బోస్, ఆజామ్గఢ్ జిల్లాలో కైలాస్ కుమార్ గౌతమ్, బల్ రాంపూర్ జిల్లాలో నసీమా, మహ్మద్ తాహేర్ ఖాన్ విజయం సాధించినట్లు ఎంఐఎం సోమవారం హైదరాబాద్లో ఓ ప్రకటనలో పేర్కొంది.
మోదీ సీటులో బీజేపీకి షాక్
Published Tue, Nov 3 2015 1:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement