ఆప్ సర్కార్ను కూల్చేందుకు బీజేపీ కుట్ర! | Sakshi
Sakshi News home page

ఆప్ సర్కార్ను కూల్చేందుకు బీజేపీ కుట్ర!

Published Mon, Feb 3 2014 1:55 PM

ఆప్ సర్కార్ను కూల్చేందుకు బీజేపీ కుట్ర! - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సామాన్యుడి ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు జరుగుతున్నాయా...? ఆమ్ఆద్మీ ఎమ్మెల్యేలను కొనడానికి తెర చాటు కార్యక్రమాలు సాగుతున్నాయా...? అవుననే అంటోంది ఆమ్ఆద్మీ పార్టీ. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ.... తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నిందని కేజ్రీవాల్ బృందం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ కనుసన్నల్లోనే ఈ కుతంత్రం సాగుతోందని ఆప్ నేతలు ఘాటుగా విమర్శించారు.

ఆప్ సర్కారుపై దుష్ప్రచారం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ కలసి కట్టుగా ముందుకు సాగుతున్నాయి ఆప్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు పదే పదే అడ్డంకులు సృష్టిస్తున్నారని, పరిపాలన సజావుగా సాగకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారి అసలు రంగును, వారి కుటిల ప్రయత్నాలను త్వరలోనే బయటపెడతామని చెప్పారు.

Advertisement
Advertisement