ఆటంకవాద రాజకీయాలపై తీర్మానం: నఖ్వీ | Sakshi
Sakshi News home page

ఆటంకవాద రాజకీయాలపై తీర్మానం: నఖ్వీ

Published Tue, Aug 4 2015 11:40 AM

ఆటంకవాద రాజకీయాలపై తీర్మానం: నఖ్వీ

న్యూఢిల్లీ: సుష్మ స్వరాజ్, వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ వారికి అండగా ఉంటుందని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న అభివృద్ధి నిరోధక, ఆటంకవాద, వ్యతిరేక రాజకీయాలను నిరసిస్తూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఓ తీర్మానం ఆమోదించిందని తెలిపారు. సుష్మ, రాజె, చౌహాన్ రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఉభయ సభల్లోనూ సభా కార్యకలాపాలను స్తంభింపజేస్తున్నారు.

Advertisement
Advertisement