బీజేపీకి 'నమో'త్సాహం | Sakshi
Sakshi News home page

బీజేపీకి 'నమో'త్సాహం

Published Wed, Aug 10 2016 1:47 PM

బీజేపీ ప్రస్తుత హెడ్ ఆఫీస్(11, అశోక రోడ్డు) - Sakshi

న్యూఢిల్లీ: 'నమో' నామస్మరణ ఉత్సాహంతో భారతీయ జనతాపార్టీ మరో కీలక ముందడుగు వేయనుంది. దాదాపు 10 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన బీజేపీ.. తన స్థాయికి తగ్గట్లు కళ్లుచెదిరిపోయేలా నూతన కార్యాలయాన్ని నిర్మించనుంది. ప్రస్తుత ప్రధాన కార్యాలయం 11, అశోకా రోడ్డుకు 5 కిలోమీటర్ల దూరంలోగల దీన్ దయాళ్ ఉపాథ్యాయ రోడ్డులో రెండెకరాల స్థలంలో నిర్మించనున్న కొత్త ఆఫీసుకు.. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాలు ఆగస్టు 18న శంకుస్థాపన చేయనున్నారు.

తుది డిజైన్ కోసం భారీ కసరత్తు చేసిన అమిత్ షా ఎట్టకేలకు ఏడంతుస్తుల ప్రధాన భవనం, దాని పక్కనే మూడంతస్తుల భవనాలు రెండు ఉండేలా రూపొందించిన డిజైన్ కు ఓకే చెప్పారు. అత్యాధునిక హంగులతో నిర్మితం కానున్న కార్యాలయంలో రెండు విశాలమైన సమావేశ మందిరాలు, పార్టీ ముఖ్యుల కోసం 70 ప్రత్యేక గదులు,  మీడియా పాయింట్, ఆఫీస్ ప్రాంగణంలో వైఫై, గ్రీన్ టాయిలెట్లు, సౌర విద్యుత్ తదితర ఏర్పాట్లుంటాయని తెలిసింది.

Advertisement
Advertisement