'బీజేపీతోనే కశ్మీర్ అభివృద్ధిలో నూతన శకం' | Sakshi
Sakshi News home page

'బీజేపీతోనే కశ్మీర్ అభివృద్ధిలో నూతన శకం'

Published Mon, Dec 8 2014 9:50 PM

'బీజేపీతోనే కశ్మీర్ అభివృద్ధిలో నూతన శకం'

జమ్మూ: జమ్మూకశ్మీర్ లో అభివృద్ధి జరగకపోవడానికి నేషనల్ కాన్ఫెరెన్స్, కాంగ్రెస్ పార్టీలే కారణమని బీజేపీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శించారు. రాష్టాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ రెండు పార్టీలు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిర్మల్ సింగ్ కు మద్దతుగా బిలావర్ లో సోమవారం సిద్ధూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కశ్మీర్ అభివృద్ధిలో నూతన శకం ప్రారంభం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఓటర్లను ఆయన కోరారు.

Advertisement
Advertisement