విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): కొంతమంది విద్యార్థులు బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ బుధవారం హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇటీవల ముగిసిన మెడికల్ కౌన్సెలింగ్లో ఏడుగురు అగ్రకుల అభ్యర్థులు బీసీ బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందారు.
వీరిలో ఐదుగురు ఏపీ ఎంసెట్, మరో ఇద్దరు తెలంగాణ ఎంసెట్లో ర్యాంకులు పొంది సీట్లు దక్కించుకున్నారు. వారందరూ కర్నూలు జిల్లా కల్లూరు మండలం తహసీల్దార్ శివరాముడు జారీచేసినట్లు ఉన్న కుల ధ్రువపత్రాలు సమర్పించడంతో అనుమానం వచ్చినట్లు మంత్రి తెలిపారు. అనంతపురం, కాకినాడ, కరీంనగర్ జిల్లాల వారు కల్లూరు మండలంలో ఉంటున్నట్లుగా నివాస ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు.
ఈ ఏడుగురిలో ఆరుగురు బాలికలు కావడం విశేషం. వారందరికీ బీసీ వెల్ఫేర్ కమిషన్ ఇచ్చిన జాబితా ప్రకారం హెల్త్ యూనివర్సిటీలో జరిగిన కౌన్సెలింగ్లో అధికారులు సీట్లు కేటాయించారు. మిగిలిన కౌన్సెలింగ్ కేంద్రాల్లోనూ ఎవరైనా ఇలా చేరారేమో విచారణ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. డీజీపీ, ఇంటెలిజన్స్ డీజీ దృష్టికి తీసుకువచ్చామని, సీబీ సీఐడీ విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విద్యార్థులపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఈ విషయాన్ని ఎంసీఐ దృష్టికి తీసుకెళ్లి బీసీ విద్యార్థులకు చెందాల్సిన సీట్లు వారికే కేటాయించేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. సదరు తహసీల్దార్ విషయమై కర్నూలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసి అక్కడి నుంచి వేరే చోటికి బదిలీచేసినట్లు చెప్పారని వివరించారు.
ఇదే విషయమై ప్రస్తుతం వెలుగోడులో తహసీల్దార్గా పనిచేస్తున్న శివరాముడును ‘సాక్షి’ వివరణ కోరగా... నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం ఇప్పుడే తెలిసిందన్నారు. తహసీల్దార్గా ఇప్పటి వరకు లక్షా 70వేల సర్టిఫికెట్లు జారీ చేశానని, వీటిలో నకిలీలు ఉన్నట్లు తెలియదన్నారు. పరిశీలించిన తర్వాత వివరణ ఇస్తానని చెప్పారు.
బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు
Published Thu, Oct 15 2015 3:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడో దశలో 63.53% పోలింగ్
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
నల్లమలలోగుప్తనిధుల వేట
10న ప్రధాని మోదీ రాక
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
లక్ష్యం.. బహుదూరం
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
వంశీచంద్ అభ్యర్థి కాదు.. రేవంత్ షాడో
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement