రేపటికి వాయిదా పడిన ఉభయ సభలు | Sakshi
Sakshi News home page

రేపటికి వాయిదా పడిన ఉభయ సభలు

Published Thu, Dec 5 2013 11:48 AM

Both Houses of Parliament Adjourned for Tomorrow

న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. ఈ రోజు ఉదయం ఉభయసభలు ప్రారంభం కాగానే... ఇటీవలి కాలంలో మృతి చెందిన మాజీ ఎంపీలకు నివాళి అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో తుపాన్ల ప్రభావంతో మృతి చెందినవారికి సంతాపసూచకంగా ఉభయ సభలు మౌనం పాటించాయి. అనంతరం రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

Advertisement
Advertisement