కొత్త ఏడాదిలో ఐదురోజులపాటు వరుస నష్టాలు చవిచూసిన స్టాక్ సూచీలు బుధవారం తొలిసారిగా లాభపడ్డాయి. స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 36 పాయింట్లు ఎగిసి 20,729 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 6,174 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎంపికచేసిన పీఎస్యూ, ఫార్మా, ఆటో షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలుచేశారు. కోల్ ఇండియా, గెయిల్, సిప్లా, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2-3%ర్యాలీ జరిపాయి. టాటా పవర్, కెయిర్న్ ఎనర్జీ, ఎన్ఎండీసీ, పీఎన్బీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు 1-2% మధ్య పెరిగాయి. ప్రధాన బ్యాంకింగ్ షేర్లన్నీ మందకొడిగా ట్రేడయినా, ప్రత్యేక డివిడెండ్ ప్రకటిస్తున్నాయన్న వార్తలతో మిడ్సైజ్ పీఎస్యూ బ్యాంక్ షేర్లు 4-8% మధ్య భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపాయి. ఎఫ్ఐఐలు రూ. 79 కోట్ల పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 88 కోట్లు వెనక్కు తీసుకున్నాయి.
పీఎస్యూ బ్యాంకింగ్ కౌంటర్లలో లాంగ్ బిల్డప్...
మిడ్సైజ్ పీఎస్యూ బ్యాంకింగ్ కౌంటర్లలో భారీ నగదు కొనుగోళ్లతో పాటు ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో పెద్ద ఎత్తున లాంగ్ బిల్డప్ జరిగింది. అన్నిటికంటే అధికంగా 8 శాతం ర్యాలీ జరిపిన సిండికేట్ బ్యాంక్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 14.28 లక్షల షేర్లు యాడ్కావడంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 61.08 లక్షల షేర్లకు పెరిగింది. అలహాబాద్ బ్యాంక్ ఫ్యూచర్ ఓఐలో 17.22 లక్షల షేర్లు (34 శాతం), యూనియన్ బ్యాంక్ ఫ్యూచర్లో 13.72 లక్షల షేర్లు (15 శాతం), ఐడీబీఐ బ్యాంక్ ఫ్యూచర్లో 9.52 లక్షల షేర్లు (11 శాతం), బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్లో 15.08 లక్షల షేర్లు (24 శాతం), కెనరా బ్యాంక్ ఫ్యూచర్లో 5.74 లక్షల షేర్ల (9.5 శాతం) చొప్పున యాడ్ అయ్యాయి. అయితే నిఫ్టీ 50 షేర్లలో భాగమైన స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్యూచర్లలో ఓఐ తగ్గింది. బీవోబీ 2 శాతం పెరిగినప్పటికీ, ఎస్బీఐ స్వల్పంగా తగ్గింది.
కొత్త ఏడాదిలో తొలి లాభం
Published Thu, Jan 9 2014 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement