అసెంబ్లీ బయట కారులో మంటలు | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ బయట కారులో మంటలు

Published Fri, Dec 18 2015 8:01 PM

అసెంబ్లీ బయట కారులో మంటలు - Sakshi

హైదరాబాద్: అసెంబ్లీ ముగిసిన కొద్ది క్షణాల్లోనే అసెంబ్లీ ఎదుట ఉన్న కారులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. కారు ఇంజన్‌లో ఏర్పడిన సమస్య వల్లే మంటలు చెలరేగాయన్న విషయం తెలుసుకొని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ వాహనం ఇంజన్‌లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో.. కారు పూర్తిగా దగ్ధమైంది.

శుక్రవారం రాత్రి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు వాహనం వైపు వెళుతున్న సమయంలో ఈ మంటలు ఎగసిపడ్డాయి. ఇది గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే అక్కడి నుంచి దూరంగా వచ్చేయడంతో ప్రమాదం తప్పింది.  అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు ఉండటంతో త్వరితగతిన చర్యలు చేపట్టి పెను ప్రమాదం జరగకుండా చూసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement