మార్చి 1 నుంచి సీబీఎస్సీ పరీక్షలు | Sakshi
Sakshi News home page

మార్చి 1 నుంచి సీబీఎస్సీ పరీక్షలు

Published Tue, Nov 19 2013 1:33 AM

CBSE Class X, XII exams from March 1, 2014

న్యూఢిల్లీ: సీబీఎస్సీ 10, 12 తరగతుల పరీక్షలను 2014 మార్చి 1 నుంచి నిర్వహిస్తున్నట్టు సీబీఎస్సీ బోర్డు వెల్లడించింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పరీక్షలను ముందస్తుగా నిర్వహిస్తారేమోననే ఊహాగానాలకు తెరదించుతూ ఏటా నిర్వహించే విధంగానే షెడ్యూల్ ప్రకారమే ఆయా పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు నెల రోజులపాటు జరగనున్నాయి.

Advertisement
Advertisement