సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనతో ముందుకు రావాలని, అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వి.మైసూరారెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విభజన వల్ల ప్రధానంగా రాజధాని హైదరాబాద్తో పాటు నీటి పంపకాల విషయంలో సమస్యలున్నాయని చెప్పారు. మిగులు, నికర జలాలపై ఇప్పటి దాకా తమ పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం నుంచి సమాధానమే లేదన్నారు.
‘‘కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఒకే రాష్ట్రంలో ఉన్నందున ప్రజల అభీష్టం మేరకు అన్ని ప్రాంతాల వారు ఆ నీటిని వాడుకున్నారు. కానీ రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాలకు ఒక ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. ప్రతి నీటి చుక్కనూ లెక్కకడుతుంది. మిగులు జలాల ఆధారంగానే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మితమైన నెట్టెంపాటు, కల్వకుర్తి, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఎస్ఎల్బీసీ, పులిచింతల ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ కూడా ఒక్క చుక్కనీరు అధికారికంగా పంపకాలు జరపలేదు. అలాగే గోదావరి పరీవాహక ప్రాంతంలో కూడా ఈ సమస్య తలెత్తనుంది.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారే కానీ.. నీటి కేటాయింపులు ఎలా చేస్తామనేది ఎందుకు చెప్పలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎన్ని సీట్లు వస్తాయనే ఆలోచన తప్ప.. ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని మైసూరా మండిపడ్డారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య నదీ జలాల పంపకాలు, యాభై ఏళ్లుగా అన్ని ప్రాంతాల వారూ ఉమ్మడిగా ఉంటున్న రాజధాని హైదరాబాద్పై కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేయటం సరికాదని తప్పుపట్టారు. ‘‘రాష్ట్ర విభజన వ్యవహారాన్ని కాంగ్రెస్ తన సొంత ఇంటి విషయంలా భావి స్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా హైపవర్ కమిటీని ప్రకటించింది. కానీ దానివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనమేమీ ఉండదు. అదొక పవర్లెస్ కమిటీ.. చెత్త కమిటీ’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్లోని అసంతృప్తులను సముదాయించటానికే ఈ పార్టీ కమిటీని వేశారు తప్పితే.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల వారికి చిత్తశుద్ధి లేదని ఎండగట్టారు.
కాంగ్రెస్, టీడీపీల నేతలవి డ్రామాలే...
పార్లమెంటులో కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు చేస్తున్న ప్రదర్శనలు ఉత్తి డ్రామాగానే పరిగణించాల్సి వస్తోందని మైసూరారెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టటానికే రెండు పార్టీల నేతలు ఈ డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వంపై విశ్వాసం లేదని మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎమ్మెల్యేలు గవర్నర్ దగ్గరకు వెళ్లి చెప్పాలి.. అలా చేస్తే ప్రజలు విశ్వసిస్తారే కానీ.. రాజీనామాలు అంటూ పీసీసీ అధ్యక్షుడికి ఇస్తే నమ్మెదెవరు?’’ అని నిలదీశారు. టీడీపీ నేతల వ్యవహారం కూడా కాంగ్రెస్ మాదిరిగానే ఉందన్నారు. ‘‘టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్జీవోలు కలిసినప్పుడు విభజనపై గతంలో నిర్ణయం తీసుకున్నానని.. అందులో మార్పులేదని చెప్పారు. అలాంటప్పుడు టీడీపీ ఎంపీలు రాజ్యసభలో నిరసనలు చేయటం ఎందుకు?’’ అని దుయ్యబట్టారు.
మేం వచ్చాక కేసులు ఎత్తేస్తాం...
సమైక్య ఉద్యమకారులపై అక్రమంగా బనాయించిన కేసులన్నింటినీ తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని మైసూరా తెలిపారు. ‘‘ప్రజలు వారి సమస్యలపై నిరసన గళం విప్పుతుంటే పోలీస్ బాస్ (డీజీపీ) మాట్లాడుతూ.. నిఘా పెట్టాం... కేసులు బనాయిస్తాం అంటున్నారు. కానీ మేము కచ్చితంగా ఒక మాట చెప్పగలం. అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. అక్రమ కేసులన్నీ ఎత్తేస్తాం’’ అని స్పష్టంచేశారు.
మా ప్రశ్నలకు సమాధానమేదీ: మైసూరారెడ్డి
Published Fri, Aug 9 2013 3:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement