యూఏవీ సమాచారంతోనే దాడులు | Sakshi
Sakshi News home page

యూఏవీ సమాచారంతోనే దాడులు

Published Tue, May 23 2017 9:00 AM

యూఏవీ సమాచారంతోనే దాడులు - Sakshi

న్యూఢిల్లీ: మానవ రహిత విమానాలు(యూఏవీ) మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు అందిస్తున్న తాజా సమాచారం ఆధారంగా వారిపై దాడులు నిర్వహిస్తున్నట్లు హోం శాఖ అధికారులు తెలిపారు. ఇలా దాడులు చేయడం వల్ల మావోయిస్టులు పన్నే ఉచ్చుల నుంచి తప్పించుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఉన్న యూఏవీ సమాచార సేకరణ కేంద్రాన్ని ఆధునీకరించారని, ఇది భద్రతా బలగాలకు మావోయిస్టుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తోందని వెల్లడించారు. యూఏవీలు అడవుల్లో నేలపైకి దిగలేకపోవడంతో సమాచార సేకరణలో భద్రతా బలగాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో పొదల్లోకి కూడా చొచ్చుకెళ్లి ఫొటోలు తీసే రాడార్లను, ఇతర ఆధునిక పరికరాలను హోం శాఖ సేకరించే పనిలో ఉంది. 

Advertisement
Advertisement