ప్రణబ్ సిబ్బందికి తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

ప్రణబ్ సిబ్బందికి తప్పిన ప్రమాదం

Published Sun, Oct 23 2016 6:45 PM

Chopper carrying Pranab staff members emergency landing at Vadodara

వడోదర: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయ సిబ్బందికి ప్రమాదం తప్పింది. ఆదివారం ప్రణబ్ కార్యాలయ సిబ్బందిని తీసుకెళ్తున్న హెలికాప్టర్కు సాంకేతికలోపం ఏర్పడటంతో గుజరాత్లోని వడోదరలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు.

ఈ హెలికాప్టర్లో కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ సింఘ్ వాఘేలా కూడా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రపతి ప‍్రణబ్ గుజరాత్ పర్యటనకు వెళ్లడంతో కార్యాలయ సిబ్బంది ఆయన వెంట వెళ్లారు.

Advertisement
Advertisement