చంద్రబాబుపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు

Published Tue, Jul 14 2015 5:45 PM

complaint filed against chandra babu in NHRC

న్యూఢిల్లీ: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 27 మంది మరణించిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. వీరరాఘవ రెడ్డి అనే న్యాయవాది చేసిన ఈ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది.  

పుష్కరాల తొక్కిసలాట ఘటనను నిలువరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వీరరాఘవ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

Advertisement
Advertisement