పణాజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు పార్టీ అగ్రశ్రేణి నాయకులే కారణమని నిందిస్తున్నారు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రోహన్ కాంటె కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు.
'గోవాలో అత్యధిక సీట్లు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అయితే మా పార్టీ నాయకులు సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోయారు. ఫలితాలు వెలువడిన తర్వాత మా నాయకులు అనుసరించిన వైఖరి నన్ను మనస్తాపానికి గురి చేసింది. పార్టీ నాయకులు సరిగా వ్యవహరించలేదు. సీఎల్పీ నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం చేశారు' అని వాల్పోయి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె నిందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడానికి కారణం తమ నాయకులేనని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే జెన్నిఫర్ మాన్సెరట్టె విమర్శించారు. ప్రజలు తమకు అనుకూలం తీర్పు ఇచ్చారని, దీన్ని గౌరవించడంలో తమ నాయకులు విఫలమయ్యారని, పూర్తిగా వారి తప్పిదమని నిందించారు. ప్రజలు బీజేపీని తిరస్కరించి తమకు అవకాశం ఇచ్చారని, అయితే తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యామని ఇతరులను నిందించాల్సిన పనిలేదని కాంగ్రెస్ సీనియర్ నేత లారెన్కో అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ దృష్టికి ఈ విషయం రావడంతో అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడుతానని ఆయన చెప్పారు.
గోవాలో అధికార బీజేపీ 13 సీట్లకే పరిమితం కాగా ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు. కాగా బీజేపీకి చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీకి ఎమ్మెల్యేల బలం 22కు పెరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు కోరడంతో అధిష్టానం సూచన మేరకు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ ఆహ్వానం మేరకు పారికర్ గోవా సీఎంగా మంగళవారం ప్రమాణం చేయనున్నారు.
మా నాయకుల వైఫల్యం వల్లే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Published Mon, Mar 13 2017 3:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement