నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు | Sakshi
Sakshi News home page

నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు

Published Fri, Nov 20 2015 12:59 PM

నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు - Sakshi

పాట్నా: బిహార్ మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అశోక్ చౌదరి, మదన్ మోహన్ ఝా, అవదేశ్ సింగ్, అబ్దుల్ మస్తాన్ మంత్రులుగా ప్రమాణం చేస్తారని సమాచారం. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడి బిహార్ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, నితీశ్ కుమార్ అధికారంలోకి రావడంతో బిహార్ లో జంగిల్ రాజ్ పాలన అంతరించిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. సుపరిపాలన అందిస్తారని నితీశ్ పై బిహార్ ప్రజలు ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. ఆయనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

Advertisement
Advertisement