కాంగ్రెస్ లోక్సభ అభ్యర్ధుల ఎంపికకు స్ర్కీనింగ్ కమిటీ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ లోక్సభ అభ్యర్ధుల ఎంపికకు స్ర్కీనింగ్ కమిటీ

Published Thu, Jan 9 2014 11:20 PM

Congress names screening committees for selection of LS candidates

ఢిల్లీ: రానున్న 2014 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ లోక్సభ అభ్యర్ధుల ఎంపికకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది.  ఇందులో భాగంగా కాంగ్రెస్ 2014 లోక్సభ అభ్యర్ధుల ఎంపికకు స్ర్కీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్గా కేంద్ర మంత్రి వయలార్ రవిని నియమించినట్టు సమాచారం. ఈ స్ర్కీనింగ్ కమిటీలో ఏఐసీసీ అధికార ప్రతినిధి భక్తచరణ్‌ దాస్తోపాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిలను సభ్యులుగా నియమించినట్టు తెలిసింది. కాగా, కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలకు స్ర్కీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement