వరుసగా మూడోరోజూ కాంగ్రెస్ నిరసన
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కుతోందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. తమ పార్టీ సభ్యులు 25మందిని సస్పెండ్ చేయటంపై మూడు రోజులుగా నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్, గురువారం కూడా తమ ఆందోళనను కొనసాగించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పార్టీ ఇతర సీనియర్ నేతలంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. తమ పార్టీ నేతలను సస్పెండ్ చేసి తమ గొంతును ప్రజలకు చేరకుండా చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సమాజ్వాది పార్టీ, జేడీయూ, ఆర్జేడీలు ధర్నాలో పాల్గొన్నాయి.
పార్లమెంటు లోపలా అదే పరిస్థితి
గురువారం ఉభయసభల్లోనూ విపక్షాల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఉదయం 11గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే సమాజ్వాది, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఎం పార్టీలు నినాదాలు చేస్తూ ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించాయి. విపక్షాలను స్పీకర్ అడ్డుకున్నారు. దీంతో ఆ పార్టీల సభ్యులు సభనుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఆ తరువాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు.
కాగా, స్పీకర్ అధికార నివాసం ఎదుట బుధవారం నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్పై బీజేపీ హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చింది. ఇటు రాజ్యసభలో వరుసగా మూడో రోజూ ఎలాంటి కార్యక్రమాలు సాగలేదు. దిగువసభలో కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్కు నిరసనగా ఆ పార్టీ సభ్యు లు పెద్దల సభలో నినాదాలు చేశారు. అవినీతి నిరోధక చట్టం సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని చూసిన ప్రభుత్వ ప్రయత్నాలు గురువారమూ ఫలించలేదు. అయితే పరిస్థితి చక్కపడకపోవటంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ శుక్రవారానికి సభను వాయిదా వేశారు.
చెక్బౌన్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం
చెక్బౌన్స్ చట్ట సవరణ బిల్లును గురువారం లోక్సభ ఆమోదించింది. చెక్ బౌన్స్ అయిన సందర్భంలో చెక్ జారీ చేసిన ప్రాంతంలో కాకుండా, దాని క్లియరెన్స్ కోసం వేసిన బ్యాంక్ ఉన్న ప్రాంతంలో కేసు పెట్టేందుకు దీంతో అవకాశం లభిస్తుంది. మరోవైపు 30 ఏళ్లకు పైబడిన 295 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
పంచాయతీలకు రూ. రెండు లక్షల కోట్లు!
పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రానున్న ఐదేళ్లలో దేశంలోని గ్రామపంచాయతీలకు రూ. 2,00,292 కోట్లు కేటాయించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ గురువారం లోక్సభకు తెలిపారు. నాణ్యమైన పనులు చేపట్టేలా పంచాయతీల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. దేశంలో 2,39,812 పంచాయతీలుఉంటే... వీటిలో 43,653 పంచాయతీలకు సొంత భవనం లేదని తెలిపారు.
పోటాపోటీగా విప్ల జారీ: ఎంపీలందరూ శుక్రవారం రాజ్యసభకు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్లు విప్లు జారీచేశాయి. ప్రభుత్వం ఏవైనా బిల్లులను రాజ్యసభ ముందుకు తేవడానికి ప్రయత్నించవచ్చని, అందుకే బీజేపీ విప్ జారీచేసిందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. అందుకే హడావుడిగా తమ ఎంపీలకు విప్ జారీచేసింది.
విపక్షాల గొంతు నొక్కుతున్నారు
Published Fri, Aug 7 2015 12:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement