ప్రచారం చేస్తే.. కోటీ 75 లక్షలు | Sakshi
Sakshi News home page

ప్రచారం చేస్తే.. కోటీ 75 లక్షలు

Published Sun, Jul 19 2015 2:24 PM

ప్రచారం చేస్తే.. కోటీ 75 లక్షలు - Sakshi

వాషింగ్టన్: ఏడాదికి రూ.కోటీ 75 లక్షలు.. ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు భారత సంతతి యువతి హుమా అబేదిన్ తీసుకుంటున్న వార్షిక వేతనమిది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం హిల్లరీ క్లింటన్ తరఫున హుమా అబేదిన్ ప్రచారం చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా హిల్లరీకి వద్ద పనిచేస్తున్న ఆమె.. ఈ ఏడాది తొలి మూడు నెలలకు గాను రూ.44 లక్షలను వేతనంగా అందుకున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హిల్లరీ తరఫున ప్రచారం చేసే బృందం మేనేజర్ జాన్ పొడెస్టా అందుకున్న జీతం రూ.17 లక్షలే. హిల్లరీ తరఫున ప్రచారంలో హుమా ఎంతో కీలకపాత్ర పోషిస్తుంటారని, పలుమార్లు స్వయంగా ఆమె ప్రసంగిస్తుంటారని ప్రచార బృందంలోని సభ్యులు తెలిపారు. హుమా తండ్రి సయ్యద్ జైనుల్ అబేదిన్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.
 

Advertisement
Advertisement