గవర్నర్‌పై షబ్బీర్‌అలీ తీవ్రవ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

గవర్నర్‌పై షబ్బీర్‌అలీ తీవ్రవ్యాఖ్యలు

Published Mon, Jan 2 2017 2:14 PM

గవర్నర్‌పై షబ్బీర్‌అలీ తీవ్రవ్యాఖ్యలు - Sakshi

హైదరాబాద్‌: ‘‘ ఒక్కసారి తను మైండ్‌లో అనుకుంటే.. వెనక్కి తగ్గకుండా పని పూర్తిచేస్తారు. గత 31 నెలల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలనను అందించింది. అందరూ సమర్థంగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది..’’అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావుపై గవర్నర్‌ నరసింహన్‌ పొగడ్తల వర్షం కురిపించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌ తన పదవిని పొగిడించుకునేందుకే కేసీఆర్‌ భజన చేస్తున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు.

'తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌లో డైనమిజం ఎక్కడుందో గవర్నరే చెప్పాలి. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను మంత్రిగా ప్రమాణం చేయించడం ద్వారా గవర్నర్‌ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చారు. ఇప్పుడు పదవిని పొడిగించుకునేందుకే కేసీఆర్‌ భజన చేస్తున్నారు'అని షబ్బీర్‌ ఆరోపించారు. (కేసీఆర్‌ డిసైడ్‌ అయితే అంతే: గవర్నర్‌ నరసింహన్‌) 

Advertisement
Advertisement