సోనియాతో దామోదర, నాదెండ్ల భేటీ | Sakshi
Sakshi News home page

సోనియాతో దామోదర, నాదెండ్ల భేటీ

Published Mon, Feb 24 2014 11:19 AM

సోనియాతో దామోదర, నాదెండ్ల భేటీ - Sakshi

న్యూఢిల్లీ : డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అధిష్టానం పిలుపుతో ఆయన హస్తిన వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందటంపై  దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా సోనియాను కలిశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై చర్చించినట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీని కలిసేందుకు క్యూ కట్టారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు ఎం.ఏ. ఖాన్ కూడా సోనియాను కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ మరోసారి తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించినందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు కలిసినట్లు చెప్పారు.

అలాగే కాంగ్రెస్ నేత గంగాభవాని కూడా సోనియాను కలిసినవారిలో ఉన్నారు. కాపులను బీసీల్లోకి చేర్చాలని సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు గంగాభవాని తెలిపారు. కాంగ్రెస్ ద్వారానే కాపులకు రాజ్యాధికారం వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement