దిగ్విజయ్ మాటలను ఎవరూ నమ్మరు: గంటా | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్ మాటలను ఎవరూ నమ్మరు: గంటా

Published Fri, Nov 8 2013 1:48 PM

దిగ్విజయ్ మాటలను ఎవరూ నమ్మరు: గంటా - Sakshi

న్యూఢిల్లీ :  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని....ఆయన మాటలను ఎవరూ నమ్మరని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. దిగ్విజయ్ ఏది చెబితే ....దానికి వ్యతిరేకంగా జరుగుతుందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. అంతకు ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుందని చెప్పారని... అయితే ఇంతవరకూ పర్యటించలేదన్నారు.

దిగ్విజయ్ చెప్పిన అంశాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ముందుకు వెళుతుందన్నారు. సీఎంను మార్చి కాంగ్రెస్ మరో తప్పు చేస్తుందని తాను అనుకోవటం లేదని గంటా అన్నారు. అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా  రాష్ట్రం ఏర్పడలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రపతి రబ్బరు స్టాంప్లా కాకుండా క్రియాశీలకంగా ఉన్నారని గంటా అన్నారు. విభజన ప్రక్రియను రాష్ట్రపతి అడ్డుకుంటారని భావిస్తున్నామని ఆయన తెలిపారు. మరో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విభజనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు.  రాష్ట్రాన్ని విభజిస్తే ప్రజల మనస్సులో నుంచి కాంగ్రెస్ పూర్తిగా చెరిగిపోతుందన్నారు.

Advertisement
Advertisement